దుమాలలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను స్పీడ్ అప్ చేయాలి
– అకాల వర్షాలకు జరిగిన పంట నష్టం ను మదింపు చేస్తున్నాం
– *జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*
—————————–
సిరిసిల్ల 29, ఏప్రిల్ 2022:
——————————
దుమాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న చిట్టివాగు, పెద్ద చెరువు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను స్పీడ్ అప్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ఆదేశాల మేరకు
శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
చిట్టివాగు, పెద్ద చెరువు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మొదట పరిశీలించారు. అనంతరం నర్సరీ , వైకుంఠ ధామం,
గ్రామ పంచాయితీ కంపోస్టు షెడ్ నిర్వహణ తీరును పరిశీలించారు. నిర్వహణను మెరుగుపరిచేందుకు గ్రామ పంచాయితీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఆ వెంటనే
ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
గ్రామంలో పెండింగ్ పనులపై ఆయా అధికారులతో సమీక్ష నిర్వహించి వేగవంతం చేయాలని ఆదేశించామని అన్నారు.
ఈ రోజే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ A రకం రూ. 1960 , సాధారణ రకం రూ.1940 కు ధాన్యం కొంటామనీ తెలిపారు. రైతులు
పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
అకాల వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం ను లెక్కిస్తున్నామని , మదింపు పూర్తయ్యాక నష్టం వివరాలనూ ప్రభుత్వం కు నివేదిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
గ్రామ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, ఎంపిడివో శ్రీ చిరంజీవి, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు,
తదితరులు పాల్గొన్నారు
——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.