దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది
జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలో – జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్
—————————–
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందని, దీనిని అందరు గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , zpceo గౌతమ్ రెడ్డి కలిసి పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించుకుంటుందని అన్నారు.
2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు
జిల్లాలో ఇటీవలే ఓటరు జాబితా సవరణ పూర్తి చేసి , 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూపోందించిన పాట మనమంతా చుసామని, భారత దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటరు చేతిలో ఉంటుందని, ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు
ఓటరుగా మనమంతా బాధ్యతగా వ్యవహరించాలని, ఓటు హక్కు వినియోగించుకోవటంలో గర్వపడాలని , సినియర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వేస్తూ మనకు ఆదర్శంగా ఉన్నారని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే స్లోగన్ తో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగం ఆవశ్యకత పట్ల వివరించి ఓటు వేయడం అనేది మన బాధ్యత అని తెలియజేశారు.
ఓటరు దినోత్సవం వేడుకలో అందరితో ఓటు హక్కు వినియోగం సంబంధించిన ప్రతిజ్ఞ అదనపు కలెక్టర్ చేయించారు.
జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు సక్రమ మార్గంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా ఉపయోగించాలని సూచిస్తూ ఓటరు గా నమోదు చేసుకున్నందుకు వారిని అదనపు కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ బి గంగయ్య , ఎలక్షన్ డి.టి. రెహమాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు జాతీయ ఓటర్ల దినోత్సవం సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వీడియోను విద్యార్థిని లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తిలకించారు . అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు.