ధరణి సూపర్ సక్సెస్

– ప్రారంభమై నేటితో సంవత్సరం పూర్తి

– భూ రికార్డ్ ల నిర్వహణ , సమస్యల
పరిష్కారం లో దేశానికే ఆదర్శం

– సిద్దిపేట జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం

– సీఎం శ్రీ కేసిఆర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు

– ధరణి ప్రారంభమై సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా IDOC లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గారూ దేశంలోనే తొలిసారిగా భూ రికార్డ్ ల నిర్వహణకై ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది. .
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది.

ధరణి సూపర్ సక్సెస్

ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి.అప్పుడు జిల్లాలో ఒకటి, రెండు రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావు. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 24 తహశీల్దార్ కార్యాలయాల తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి.ప్రజలకు అందుబాటులో అతి సమీపంలో రిజిస్ట్రేషన్ లు జరగడం వల్ల ప్రజలకు దూర భారం తగ్గి సమయం కలిసి వస్తుంది.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయి.
గతంలో భూ యజమానులు కు తెలియకుండా మధ్యవర్తులు, దళారులు, పైరవీ కారులు అధికారుతో రికార్డ్ లు, పేర్ల మార్పిడి ఘటనలు అక్కడ అక్కడ జరిగేవి.
ధరణి అలాంటి ఘటనలకు చెక్ పెట్టింది.

ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటల సమయం పట్టేది. గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవి. ధరణి రాకతో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ధరణి లో ప్రత్యేకతలు
——————–
* టాంపర్ ప్రూఫ్. *పౌరులకు అనువుగా ఉండడం. *తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం.
*పారదర్శకత. *ఆధునిక సాంకేతికత వినియోగం. *వివక్షకు తావులేకుండా ఉండడం. *అతితక్కువగా అధికారుల జోక్యం

ధరణి నిర్వహణా ప్రత్యేకతలు

——————–

*అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం.
రైతు స్వేచ్చగా ఏ రోజూ, ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తానే నిర్ణయించుకునే సౌలభ్యం,
*బయో మెట్రిక్ నిర్ధారణ. *ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ. *రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్. *రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. *ఆన్లైన్ చెల్లింపులు. *అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ. *పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా. *నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం. .
నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు
——————————–

హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618

——————————-
భూ పరిపాలనలో ధరణి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయం:జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి
——————————-
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సాహోసోపేతమైన విప్లవాత్మకమైన నిర్ణయం ధరణి అని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు.

ధరణి ప్రారంభమై సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా IDOC లో జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి ధరణి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

అనతి కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన సక్సెస్ పుల్ కావడానికి దోహదపడిందని, రిజిస్ట్రేషన్లు సులభతరం చేసిందని తెలిపారు. ధరణిలో నిక్షేపమైన భూములకు భద్రత, భరోసా ఉన్నాయని, 30, 40 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా భూమి పంచాయతీలు, భూమి సమస్యలు, అభద్రత, ఇతరత్రలకు తెర పడిందని కలెక్టర్ వెంకట్రామరెడ్డి చెప్పారు. రానున్న కాలంలో భూ వివాదాలకు తావు లేకుండా, అవినీతికి తావులేకుండా, అధికారులు ఇష్టం వచ్చినట్లు చేయకుండా పకడ్బందీ వ్యూహంతో ధరణి రూపకల్పన చేసినట్లు కలెక్టర్ వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మ్యుటేషన్, పాస్ బుక్ వచ్చేందుకు నెలలు, సంవత్సరాల సమయం పట్టేదనీ , ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ జరగడంతో పాటు పాసు బుక్ కొనుగోలు దారుకు వస్తుందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కు ప్రభుత్వాలు సాహసం చేయని పరిస్థితుల్లో ….
దేశానికే ఆదర్శంగా అతి తక్కువ సమయంలోనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ పట్టుదలతో భూ సమస్యల వివాదాలకు పరిష్కారం, భూ రికార్డుల భద్రతకు తెలంగాణ రాష్ట్రంలోనే నాంది పలకడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రోజు వారీగా 100 నుంచి 150 దరఖాస్తులు వస్తే రోజు వారీగా క్లియరెన్స్ చేస్తున్నామని, రానున్న 2, 3 మాసాల్లో ధరణిలో అన్నీ పరిష్కారమవుతాయని కలెక్టర్ తెలిపారు.
రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రానికి అన్నీ రాష్ట్రాలలో ఉన్న అధికారులు ధరణి విధానాన్ని పరిశీలించేందుకు వస్తారని, ఇప్పటికే పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు విషయ సేకరణ జరుపుతున్నట్లు కలెక్టర్ వివరిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ధరణి పట్ల జిల్లా రైతుల తరపున, జిల్లా అధికార యంత్రాంగం తరపున గౌరవ సీఏం కేసీఆర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై ఆర్డీఓ లు, తహసీల్దార్ లు, ఇతర రెవెన్యూ అధికారులు చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ శ్రీ పి.వెంకట్రామ రెడ్డి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్ ను ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోందన్నారు. దరణిలో నిన్నటి వరకూ వచ్చిన అన్ని అర్జీలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
——————————-
సిద్దిపేట జిల్లాలో ధరణి పురోగతి వివరాలు
——————————-

జిల్లాలో ధరణిలో పూర్తి లావాదేవీలు : 1, 23, 696
భూమి రిజిస్ట్రేషన్లు : 41 వేల 167
వారసత్వం : 5 వేల 134
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 40 వేల 180
పెండింగ్ మ్యుటేషన్లు. : 16 వేల 124
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 13 వేల 510
నిషేధించబడిన జాబితా : 5799
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 1782

*నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు.

సీఎం శ్రీ కేసిఆర్ గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి తెలంగాణ భూ వివాద రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సాహసోపేతంగా, ధైర్యంగా ధరణి నీ తీసుకు వచ్చారని అన్నారు. సీఎం ధరణి తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అధికారులుగుగా తాము భయపడ్డానని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ధరణి ప్రారంభ మై సానుకూల ఫలితాలు చూశాక సంతోషంగా ఉందన్నారు. ధరణి లో పేరు ఎంట్రీ సమయంలో కొంత కష్టం అయిన ఒక్కసారి ధరణి లోకి ఎక్కగా రైతులు నిచ్చింతగా ఉండవచ్చునని కలెక్టర్ తెలిపారు.
అనేక సానుకూలత లువున్న ధరణి ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల అఖిల భారత సర్వీస్ అధికారులు ధరణి గురించి ఫోన్ లో తమని అడుగుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్ లు ధరణీ లో రానున్నాయని తెలిపారు. దేశానికే ఆదర్శం గా నిలుస్తున్న ధరణీ నీ తెచ్చినందుకు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అధికారులకు కలెక్టర్ అభినందన

ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న సిద్దిపేట జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి తెలిపారు.

ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

Share This Post