ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండి ప్రత్యేకించి 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలని, దాన్యం లో తేమ శాతం పరిశీలించిన తరవాతే ధాన్యం సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
శుక్రవారం గద్వాల్ మండలం అనంతపురం గ్రామంలో ఐ కె పి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా71 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1.90 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వరి లో తేమ శాతం ఎక్కువగా ఉండకూడదని, ఈ విషయంలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని , ఆన్లైన్ లో క్రాప్ బుకింగ్ చేసేటపుడు రైతు మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓ.టి.పి చెక్ చేయాలనీ అన్నారు. ధాన్యం లో తేమ శాతం 17 శాతం ఉండేలా చూసుకోవాలని , పూర్తిగా ఎండిన ధాన్యానికి టోకెన్ లు జారి చేయాలని, సెంటర్ ఇంచార్జి లకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ లో స్వయంగా ట్యాబ్ లో పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో వారి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చిన హనుమంతు అనే రైతు తో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది , ఎంత పంటకు ఎంత ధాన్యం వచ్చిందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రైతుకు సంబందించిన 5 ఎకరాలలో వచ్చిన వరి దాన్యం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి ఓ టి పి ని చెక్ చేశారు .
కలెక్టర్ గారితో పాటు లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ , డి.ఎస్.ఓ రేవతి, సెంటర్ ఇంచార్జ్ బాస్కర్, ఎ.ఇ.ఓ , తదితరులు పాల్గొన్నారు.
————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చె జారి చేయబడినది.