ప్రచురణార్థం
నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్.
మహబూబాబాద్, మే -08:
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి ఆదివారం పరిశీలించారు.
ఈ నెల 10 న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా పర్యటన సందర్భంగా నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి పనుల పురోగతిని, కళాశాల వద్ద చేపట్టిన, చేపట్టనున్న పనులపై ప్లాన్ ను పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ – అర్. అండ్ బి. తానేశ్వర్, ఏ. ఈ., డి.ఈ.సి. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ సంపూర్ణ రావు, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.