నల్గొండ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఒక స్థానం ఎన్నికకు గాను 11 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేయగా 3 అభ్యర్థుల నామినేషన్ లు వివిధ కారణాల తో తిరస్కరణకు గురి కాగా ఒకరు నిన్న గురువారం ఉపసంహరించుకున్నారు. ఎం.ఎల్.సి.ఎన్నిక లలో 7 గురు అభ్యర్థులు బరి లో ఉన్నారు.
టి.ఆర్.ఎస్ అభ్యర్ధి ఎం.కోటి రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధులు కాసం వెంకటేశ్వర్లు, రాం సింగ్ కొర్రా,బెజ్జం సైదులు,అరుపుల శ్రీశైలం,డా.కె నగేష్, వంగూరి లక్ష్మయ్యలు బరి లో ఉన్నారు.