నల్లగొండ పట్టణ పరిధి పెరిగి అభివృద్ధి చెందుతుంది. అందుకు అనుగుణంగా విద్యార్థినీ, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో స్టడీ సెంటర్ ను ప్రారంభించుకున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు.

శనివారం నల్లగొండ మహిళా ప్రాంగణం సముదాయంలో డి.పి.అర్.సి సెంటర్ లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టడీ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లగొండ పట్టణ గ్రామీణ యువతి, యువకులు అవసరానికి అనుగుణంగా పై చదువులకు ఉపయోగపడే విధంగా ఈ అధ్యయన కేంద్రం నిలవాలని ఆయన అన్నారు. స్టడీ సెంటర్ వినియోగించుకోవడానికి వచ్చిన యువతి, యువకులకు, చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదూర ప్రాంతాల నుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు అన్ని రకాలైన పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెలుబడగానే కోచింగ్ సెంటర్లకు వెళుతున్నారు. అది ఖర్చుతో కూడిన భారం కనుక ఆ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయిలో గ్రంథాలయాలను విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా పోటీ పరీక్షల కోసం ఈ స్టడీ సెంటర్ ను నిరంతరం కొనసాగిస్తామని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మీకు ఇంకా ఏమైనా పుస్తకాలు కావాలంటే వెంటనే ఇండెంటును జిల్లా పరిషత్ సీఈఓ కు సమర్పించాలని ఆయన తెలిపారు. మహిళలకు, పురుషులకు వేరు వేరుగా రీడింగ్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,
శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల
భగత్, జెడ్ పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జడ్ పి
సి ఇ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.

Share This Post