నూతన ఓటర్ల నమోదు, ఎపిక్ కార్డుల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్

పత్రికా ప్రకటన     తేది:12,.01.2022, వనపర్తి.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022, జనవరి, 1వ తేదీ నాటికి 18 సం.లు  నిండి, ఓటర్లుగా నమోదైన వారి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు, ఎపిక్ కార్డులు, బూత్ లెవల్ అధికారుల ద్వారా  అందచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
బుధవారం హైదరబాద్ నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై తగు సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ ను జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 వ. తేదీలోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని ఆయన తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని ఆయన సూచించారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు  నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జనవరి 25 వ. తేదీ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ  18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 836 మంది కొత్తగా ఓటర్లు నమోదు అయ్యారని ఆమె వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎలక్షన్ సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, ఎలక్షన్ డి. టి. తదితరులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయనైనది.

Share This Post