నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ నెల 26, 27 తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్ లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి యువతీ, యువకులను గుర్తించి గరుడ ఆప్ లేదా ఫారం -6 ద్వారా ఓటరు గా నమోదు చేయాలని ఇందుకు గాను బిఏల్ఓ లు ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించాలని అన్నారు. 1 అక్టోబర్, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివే వారు ముందస్తుగానే దగ్గరలోని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఫారం-6 ద్వారా కానీ, ఆన్లైన్ లో NVSP.in ద్వారా కానీ దరఖాస్తు చేయాలన్నారు. అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించి వారిని సైతం ఓటరు జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లను సదరం డేటా ద్వారా గుర్తించి, వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ఇంతకుముందు జాబితాలో ఉన్న వారిని, కొత్తగా నమోదు అయిన వారిని సైతం మ్యాపింగ్ చేయాలని ఆయన అన్నారు. ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని, ఒకవేళ లేనట్లయితే వారి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ రేఖాంశాలు, (లాంగిట్యూడ్), అక్షంశాలు (లాటిట్యూడ్స్ ) తప్పనిసరిగా క్యాప్చర్ చేయాలని, సూపర్వైజర్లు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో కనీసం 10 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని, అలాగే ఈఆర్ఓ వారి పరిధిలో ఉన్న 10 పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలను పరిశీలించాలని, అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనది లేనిది పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారని, దానిని పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ఫారం-7 ద్వారా బూత్ స్థాయి అధికారికి అందజేయాలని కలెక్టర్ అన్నారు.

Share This Post