నేడు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం…..

ప్రచురణార్థం

నేడు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం…..

మహబూబాబాద్, మే -06:

దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం శనివారం 7న ఉదయం 11-30 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

శారీరక వైకల్యం, వినికిడి లోపం, దృష్టి లోపం, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు ఈ నెల 12, 19, 26 తేదీలలో కొత్తగా నమోదు చేసుకునే వారి కోసం 50 చొప్పున, రెన్యువల్ కోసం 12 న యాభై, 19న యాభై ఐదు, 26 న యాభై ఐదు మందికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. శనివారం 7న ఉదయం 11-30 గంటలకు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post