న్యాయ సేవాదికార సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ సభ్య కార్యదర్శి యార రేణుక అధికారులను సూచించారు

న్యాయ సేవాదికార సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వ శాఖల ద్వారా  ప్రజలకు అవగాహన కల్పించాలని  రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ సభ్య కార్యదర్శి యార రేణుక  అధికారులను సూచించారు.  శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానం  ద్వార ఉమ్మడి జిల్లాలోని అందరు కలెక్టర్లు, ఎస్పిలు, అదనపు కలెక్టర్లు, రెవెన్యు, మెడికల్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో న్యాయ సేవాదికార సంస్థ సేవలపై  అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు.  అయితే పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాస్యులు వారికి న్యాయ సేవాదికర సంస్థ ద్వారా  ఉచిత న్యాయ సలహా దొరుకుతుంది అనే విషయం తెలియక చాలా మంది తమకు జైలు శిక్ష పడుతుందేమో, కోర్టు దండిస్తదేమో అనే భయంతో   తాము పోగు చేసుకున్న డబ్బులతో గాని లేదా తమ ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ వకీలును నియమించుకోవడం జరుగుతుందన్నారు. లేదా తప్పు చేయకున్నా బయట రాజి పడిపోతున్నారని తెలిపారు.  దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి ఎస్సి/ఎస్టి లకు, కార్మికులకు, దివ్యాంగులకు న్యాయ సేవాదికర సంస్థ ద్వారా ఉచితంగా వకీలు పెట్టుకునే అవకాహం హక్కు వారికి ఉందన్నారు.  కేవలం అవగాహన లేక న్యాయ సేవాదికర సంస్థలను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.   42వ రాజ్యంగా  సవరణ ద్వారా 1987లో అర్టికల్ 39 (ఎ) ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును  కల్పించడం జరిగిందని అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో 1995 లో న్యాయ సేవాదికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల  న్యాయ సేవాదికర సంస్థలు అనేవి జాతీయ స్థాయి నుండి మండల స్థాయి వరకు పని చేస్తున్నాయన్నారు.  అదేవిధంగా బాధితులకు న్యాయ సేవాదికర సంస్థ ద్వారా  నష్టపరిహారం కల్పించేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.  కాని ఇప్పటి వరకు కేవలం ఒక శాతం జనాభా మాత్రమే  ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు.   2018 లో పెంచిన నష్టపరిహారం ప్రకారం బాధితుడు గాయాల పాలైతే వైద్య చికిత్స  నిమిత్తం రూ. లక్ష నుండి రెండు లక్షల వరకు, అంగవైకల్యం అయితే 5 లక్షలు,  మరణిస్తే రూ. 10 లక్షలు, అత్యాచారం లాంటి కేసులకు రూ 7 లక్షలు, పోక్సో కేసులకు, యాసిడ్ దాడులకు రూ. 7 లక్షల వరకు బాధితులకు పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. దీనికి చేయాల్సిందల్లా  పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన వెంటనే సమీప మండల లేదా జిల్లా న్యాయ సేవాదికర సంస్థ కార్యాలయములో కేవలం తెల్ల కాగితం పై దరఖాస్తు చేసుకోవడమే అని  తెలియజేసారు. చాల మందికి ఈ విషయం తెలియక బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం డబ్బులు వినియోగం కాలేకపోతున్నయన్నారు.  అయితే పరిహారం పొందే విషయంలో ఒకటే నిబంధన ఉంటుందని అది బాధితుడు  కేసు మధ్యలో రాజి పడి కేసు  నీరుగారిపోయే విధంగా చేయవద్దన్నారు. బాధితుల తరపున ఉచితంగా వకీలు పట్టడం జరుగుతోందని దీనికి  తోడు  నష్ట పరిహారం సైతం  చెల్లించడం న్యాయసేవాధికార సంస్థ ద్వారానే జరుగుతుందని తెలియజేసారు.  ప్రతి జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఉంటుందని తెలియజేసారు.  టోల్ ఫ్రీ నెంబరు 15100 పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆజాదిక అమృత మహోత్సవం లో భాగంగా దేశ వ్యాప్తంగా అక్టోబర్, 2 నుండి నవంబర్, 14 వరకు గ్రామీణ స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నాయని తెలిపారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను  ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా విజయవంతంగా అమలు చేయడం జరుగుచున్నాయని, న్యాయ సంస్థ ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం ద్వారా  న్యాయ సేవాదికార సంస్థ సేవలను ప్రజలకు అవగాహన కల్పించలేకపోతున్నామనే  ఉద్దేశ్యంతో నేడు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అవగాహ కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  ఆయా ప్రభుత్వ శాఖలకు వచ్చే ప్రజలకు న్యాయ సేవాదికార సంస్థ ఉచిత సేవలపై అవగాహన కల్పించి ఎ ఒక్కరు అన్యాయంగా నష్టపోకుండా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం పొందే విధంగా క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను కోరారు.

ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా సేనియర్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహబూబ్ నగర్, నారాయణ పేట కలెక్టర్ హరిచందన దాసరి,  మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి, వనపర్తి కలెక్టర్ యాస్మిన్ బాష, అన్ని జిల్లాల ఎస్పీలు, రెవెన్యు అధికారులు, వైద్య అధికారులు, సమాచార పౌర సంబంధాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post