పదవ తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యా మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్థం——-29-3-2023

*పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

**ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉండాలి*

**పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి*

**పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు*

*విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు*

*పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి*

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ లోని వీడియో సమావేశం హాలు నుంచి *జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఎస్ మోహన్ రావు, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్* ఇతర ఉన్నతాధికారు లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 90 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2 వేల 600 పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

విద్యార్థులకు హాల్ టికెట్ లను వెబ్ సైట్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న *విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ,* పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవా లని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

*గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు*.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డీఎస్పీ నాగభూషణం మున్సిపల్ కమిషనర్లు, పోలీస్, పోస్టల్, విద్యుత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట చే జారీ చేయనైనది.

 

Share This Post