పల్లె ప్రగతి మార్గదర్శకాలకనుగుణంగా విధులు నిర్వహించని నలుగురు సర్పంచులు, ఐదుగురు పంచాయతి కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సోమవాం నాడు షోకాజ్ నోటిసులు జారీచేసారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ లు నేడు ఆకస్మిక తనఖీ చేయగా వారు పల్లె ప్రగతికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, విధి, విధానాలు పాటించక విధుల పట్ల అలసత్వం ప్రదర్శించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో సంజాయిషీ ఇవ్వవలసినదిగా ఆదేశిస్తూ షోకాజ్ నోటిసులు జారీ చేసారు. శంకరంపేట మండలం ఆరేపల్లి, శంకరంపేట సర్పంచులు, కార్యదర్శులకు, అల్లాదుర్గ్ మండలం గడిపెద్దాపూర్, టేక్మల్ మండలం పాల్వంచ సర్పంచులకు, కార్యదర్శులకు నోటిసులు జారీ చేసారు. కాగా కుల్చారం మండలం రంగంపేట్ పంచాయతి కార్యదర్శికి కూడా పల్లె ప్రగతి విధివిధానాలు పాటించ నందున షోకాజ్ నోటిసులు జారీ చేసారు.
You Are Here:
Home
→ పల్లె ప్రగతి మార్గదర్శకాలకనుగుణంగా విధులు నిర్వహించని నలుగురు సర్పంచులు, ఐదుగురు పంచాయతి కార్యదర్శులకు షోకాజ్ నోటిసులు జారీ.
You might also like:
-
నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు
-
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు
-
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు..
-
రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.