*ప్రెస్ రిలీజ్*
*హనుమకొండ*జూన్ 04
పల్లే, పట్టణ ప్రగతి పథంలో భాగంగా మన ఊరు మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
శనివారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో *మన ఊరు మన బడి*, పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుర్తించబడిన గ్రామలల్లో పాఠశాలలో ప్రభుత్వం నిబంధనల మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. కొనసాగుతున్న పనుల పురోగతి ఫోటోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలన్నారు.
గ్రామంలో పల్లే ప్రకృతి వనం నర్సరీలను, ఎప్పటికీ అప్పుడు ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేల 3 నుండి 18 వరకు *పల్లే ప్రగతి పథంలో* భాగంగా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు సంక్షేమం, *మన ఊరు మన బడి*
తదితర గుర్తించిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డిఆర్డిఓ ప్రాజెక్టు అధికారి ఏ.శ్రీనివాస్ కుమార్, డిఈఓ రంగయ్య నాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.