పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలసినదిగా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థలకు,దాతలకు అనుసంధానంగా ప్రభుత్వం httpws://vidyanjali.education.gov.in వెబ్ సైట్ ను రూపొందించిందని అన్నారు. ఈ వెబ్ సైట్ లో పాఠశాలల వారీగా అవసరమయ్యే వనరుల వివరాలుంటాయని,దాతలు వాటిని గుర్తించి ఆయా అవసరాలను తీర్చి విద్యాభివృధికి తమ వంతు సహకారమందించవలనదిగా ఆయన కోరారు. పాఠశాలలకు అవసరమైన వనరులు సమకూర్చుటకు ముందుకొచ్చే దాతలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో భోధనాపరంగా స్వచ్ఛందంగా సేవ చేయుటకు ముందుకొచ్చే పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ఈ వెబ్ సైట్ లో నమోదు కావడం ద్వారా సేవలందించవచ్చని అన్నారు. పూర్తి వివరాలకు సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరల్ అధికారి డాక్టర్ సూర్యప్రకాష్ రావు ను 9441046839 ఫోన్ నెంబరు ద్వారా సంప్రదించాలని రమేష్ సూచించారు. ఇప్పటి వరకు విద్యంజాలి వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న పాఠశాలలు తమ పాఠశాలకు అవసరమయ్యే వనరుల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలని డీఈఓ సూచించారు.
You Are Here:
Home
→ పాఠశాలల అభివృద్ధికి దాతలు రిటైర్డ్ ఉపాధ్యాయులు ముందుకు రావాలి – జిల్లా విద్యాశాఖాధికారి రమేష్
You might also like:
-
నిరుపేదలైన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరు సద్వినియోగం చేసుకొని మంచి విద్యా బుద్దులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు
-
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు
-
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ తెలంగాణలో కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు..
-
రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ శుక్రవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.