రెండు ఎకరాల భూమి దక్కినందుకు కలెక్టర్కు అభినందనలు తెలిపిన జలగం సోమయ్య. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న సోమయ్య భూమికి పట్టా పుస్తకం రాకపోవడంతో, అట్టి వివరాలతో కూడిన దరఖాస్తును సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సొమయ్య దరఖాస్తు చేసుకున్నాడు, మండల కార్యాలయంలో ఎన్నిసార్లు తెలిపిన పని జరగలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తనకు తెలంగాణ ప్రభుత్వ పట్టా పుస్తకాన్ని అందజేశారని తన సంతోషాన్ని వెలబుచ్చారు. ఈరోజు జరిగిన ప్రజావాణిలో జలగం సోమయ్య వచ్చి అదనపు కలెక్టర్, జిల్లా అధికారులకు మిఠాయిలు పంచిపెట్టాడు. ప్రజల సమస్యలకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని సోమయ్య సంతోషం వ్యక్తం చేశాడు.
You Are Here:
Home
→ పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునే వారికి తగు సమాధానం చెప్పాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తెలిపారు.
You might also like:
-
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
-
వేసవి కాలంలో చేపట్టావల్సిన ముందస్తు చర్యలపై అధికారులు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ యస్ వెంకట్రావ్ అన్నారు
-
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్పిరెన్స్ ద్వారా జిల్లాలలో Go no 58,59 కంటి వెలుగు, అగ్ని ప్రమాదాల నివారణ, పోడు భూములకి పట్టాలు,పదవ తరగతి పరీక్ష ల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు
-
క్షయ వ్యాధి నిర్ములనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తెలిపారు