ప్రగతిని చాటేలా ఘనంగా దశాబ్ది వేడుకల నిర్వహణ:: రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి

ప్రచరణార్థం…….2

తేదీ.29.5.2023

*ప్రగతిని చాటేలా ఘనంగా దశాబ్ది వేడుకల నిర్వహణ:: రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి

జయశంకర్ భూపాలపల్లి, మే -29:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి చాటే విధంగా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహించాలని రాష్ట్ర బీఎస్ శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకల మన ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.

రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకోని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయం పై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు.

రైతు దినోత్సవం ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడా ఎలాంటి పోరపాట్లు కావద్దని సీఎస్ అన్నారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి నేడు సాధించిన ప్రగతి తెలియజెస్తు నాడు నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలిస్ ఆధ్వర్యంలో సురక్షా దివాస్, తెలంగాణ రన్ నిర్వహించాలని అన్నారు.

పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గోర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు. బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం పై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, దాని ప్రకారం లబ్దిదారుల ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు,గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, కోత్త ఆసుపత్రి ఏర్పాటు, అదనపు సేవలు వివరించాలని, వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కేసిఆర్ న్యుట్రిషన్ కిట్ ప్రారంభించాలని అన్నారు.

పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని సీఎస్ అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా పారిశుద్ధ్య కార్మికుల సన్మానం చేయాలని, సఫాయిన్న సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

మిషన్ భగీరథ కింద ఇంటింటి త్రాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖ లో సాధించిన ప్రగతి పక్కాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి , అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, జూన్ 2 న ఉదయం అంబేద్కర్ స్టేడియంలో
అవతరణ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.

జిల్లాలో 45 రైతు వేదికలను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారని అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ, పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలు తోలగించామని, జూన్ 3న రైతు దినోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతు సమన్వయ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రైతులను ఊరేగింపు గా రైతు వేదిక తరలిస్తామని తెలిపారు. మండల అధికారులకు భోజన బాధ్యతలు అప్పగించామని తెలిపారు.

జూన్ 8న ఊరురా చెరువుల పండుగ నిర్వహణ కోసం జిల్లాలో ఉన్న 241 గ్రామ పంచాయతీ లలో చెరువులను ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎంపిక చేస్తామని, అక్కడ బతుకమ్మ, బోనాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు, చెరువు వల్ల గ్రామీణ ప్రాంతంలో వచ్చిన మార్పు తదితర వివరాలు తెలియజేస్తామని అన్నారు.

జిల్లాలో అన్ని శాఖల ద్వారా సాధించిన ప్రగతి వివరించేలా పకడ్బందీగా దశాబ్ది వేడుకల నిర్వహిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దివాకర, ఎస్పీ సురేందర్ రెడ్డి , ఏ.సి. ఉమా శంకర్ ప్రసాద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి , డి.ఆర్.డి.ఓ. పురుషోత్తం , డి.పి.ఆర్.ఓ.శ్రీధర్ , బి.సి. సంక్షేమ అధికారి శైలజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ , ఉద్యానవన అధికారి సంజీవరావు, డి.పి.ఓ. , ఆశా లత, సి.పి.ఓ.శామ్యూల్ , జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి , మునిసిపల్ కమిషనర్, ఇతర జిల్లా,అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి , తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post