You Are Here:
Home
→ ప్రచురణార్థం…..1 తేదీ.07.06.2023 **బీ.సి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం 9న లాంచనంగా ప్రారంభం:: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్* జయశంకర్ భూపాలపల్లి జూన్ – 7: బీసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా లాంచనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంగారెడ్డి నుండి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో సమావేశంలో పాల్గొనగా, హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించి బి.సి. కుల, వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం నుండి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. *బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ* ప్రభుత్వం బీసి కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు అందిస్తున్నామని అన్నారు. జూన్ 9న సీఎం కేసీఆర్ మంచిర్యాలలో లాంచనంగా ప్రారంభిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 లబ్దిదారులకు మించకుండా సహాయం అందించాలని అన్నారు. బీసీ కులవృత్తుల చేతి వృత్తుల వారు ఆన్ లైన్ లో ఈ రోజు సాయంత్రం వరకు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్దిదారుల ఎంపిక చేయాలని అన్నారు. జూన్ 9న లాంచనంగా ప్రారంభిస్తున్నామని, జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన తరువాత విచారణ చేపట్టి ప్రతి నెలా దశల వారిగా లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. బీసి కులవృత్తులు చేతివృత్తుల వారికి అందించే ఆర్థిక సహాయం కోసం రెండు సంవత్సరాల క్రితం ఆదాయ ధ్రువీకరణ పత్రం అంగీకరించాలని, కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ధృవీకరణ పత్రం మొదలగు పత్రాలతో జూన్ 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 20,2023 వరకు ఆన్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి లబ్దిదారుల జాబితా ఇంచార్జీ మంత్రి ఆమోదం పోందిన తరువాత వెబ్ సైట్ లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని, ఆ జాబితా వరుస క్రమం ప్రకారం ప్రతి నెలా 15 తారీఖు లోపు పారదర్శకంగా ఆర్థిక సహాయం అందుతుందని, స్థానిక ఎమ్మెల్యల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.జూన్ 9న రెండవ విడత గోర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని సూచించారు. *మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,* బీసీ కుల వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి చోప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందిస్తుందని, దీనిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం యూనిట్ గ్రౌండ్ చేసి సదరు ఫోటోలు ఆన్ లైన్ లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జూన్ 9న లాంచనంగా బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రతి నెలా 15వ తారీఖు నాడు దశల వారీగా లబ్దిదారులకు సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 14న నిర్వహించే వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి అదనంగా లక్ష రూపాయల నిధులు వైద్య శాఖ నుంచి విడుదల చేస్తున్నామని, పండుగ వాతావరణంలో వైభవోపేతంగా వైద్య శాఖ దినోత్సవం నిర్వహించాలని పేర్కొన్నారు. వైద్యశాఖలో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు అందించాలని అన్నారు. వైద్య శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగులకు చీరలు పంపిణీ చేయాలని, ఏఎన్ఎం లకు బీపి యంత్రాలు అందించాలని అన్నారు. 24 జిల్లాలలో కెసిఆర్ న్యూట్రిషన్ పథకాలు ప్రారంభించాలని తెలిపారు. రాష్ట్ర శాతంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని, వైద్య విద్యార్థులను వేడుకలకు ఆహ్వానించాలని, ఆరోగ్యశ్రీ సేవలు, డయాలసిస్, కంటి వెలుగు, కేసిఆర్ కిట్ లబ్దిదారుల పాల్గోనేలా చూడాలని అన్నారు. *సి.ఎస్. మాట్లాడుతూ,* బి.సి. చేతి, కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించుటకు గాను ఆన్లైన్ లో జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్బంగా రెండవ విడత గోర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం, అవకాశం ఉన్న చోట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ బి.సి. అభివృద్ధి అధికారి జిల్లా సంక్షేమ అధికారి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
You might also like:
-
ప్రచురణార్థం……2 తేదీ.02.10.2023 *కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* ——————————————— జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 02: ——————————————– మహిళలకు కుట్టు మిషన్లలో అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్తో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి మిలీనియం క్వార్టర్స్ లోని మెగా హాల్ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ* భూపాల్ పల్లి నియోజకవర్గం పరిధిలో ఆసక్తిగల మహిళలకు కుట్టు మిషన్లపై అవగాహన కల్పించి ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ట్రైన్ కలెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు ఎంపీపీలు, జడ్పిటిసిలు మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్ మహిళలు, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ————————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
-
Draftప్రచురణార్థం……1 తేదీ.02.10.2023 *సకల వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు…. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* **8 వేల ఎకరాల పోడు పట్టాల పంపిణీ* **13 కుల సంఘాల భవనాలకు భూపాలపల్లి పట్టణం లో భూముల కేటాయింపు* *తాత్కాలిక నిర్మాణాలకు రూ.10లక్షలు మంజూరు అయ్యేలా చర్యలు.* **13 కుల సంఘాలకు భూ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ———————————————- జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 02: ——————————————— సకల వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి ఇళ్లందు క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన బిసి, ఎస్టీ, ఎస్సీ కుల సంఘాల భవన నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి భూ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ* జీవితకాలం చివరి శ్వాస వరకు సమానత్వాన్ని బోధించిన మహాత్మా గాంధీ జయంతి నాడు 13 కుల సంఘాల భవన నిర్మాణాలకు భూ కేటాయింపు చేయడం సంతోషకరమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వివక్షకు తావు లేకుండా ప్రతి వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య బోధన, వసతి ఏర్పాటు అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియా కప్ లో మన మన రాష్ట్రానికి చెందిన నందిని అనే క్రీడాకారిణీ కాంస్య పథకాన్ని సాధించిందని, సదరు క్రీడాకారిణీ తండ్రి చాయ్ అమ్ముతారని, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం మనకు గర్వకారణం అని అన్నారు. భూపాల్ పల్లి జిల్లాలో 73% అటవీ ప్రాంతం మాత్రమే ఉందని, భూములు తక్కువగా లభ్యత ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసేందుకు వివిధ కుల సంఘాలకు భూ కేటాయింపులు చేస్తున్నామని, ఒక తోటలో వివిధ రకాల పూలు ఉన్న విధంగా ఒకే చోట 13 కుల సంఘాల భవన నిర్మాణానికి భూ కేటాయింపులు చేశామని, భూపాలపల్లి పట్టణంలో 15 ఎకరాలు గుర్తించి అందులో 10 ఎకరాలు కుల సంఘాలకు మరో ఐదు ఎకరాలు దేవాలయ నిర్మాణానికి కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కుల సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న గిరిజనులకు 8000 పోడు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పోడ్ పట్టాలకు రెవెన్యూ పట్టాలతో సమానంగా రైతుబంధు ఆర్థిక సహాయం అందజేశామని, జిల్లాలోని పాత్రికేయులకు సైతం పట్టాలు అందిస్తున్నామని, విశ్రాంత ఉద్యోగులకు నాన్ గెజిటెడ్ అధికారులకు గెజిటెడ్ అధికారులకు భూకై ట్యాంకులు చేశామని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన నేతకాని, మాల కులాలకు, ఎస్టి వర్గానికి చెందిన నాయపోడు, బంజారా కులాలకు, బీసీ వర్గానికి చెందిన గౌడ,యాదవ, పద్మశాలి, ముదిరాజు , పెరిక, కుమ్మరి బోయ, వాల్మీకి, రజక ,వడ్డెర , పూశాల నాయి బ్రాహ్మణ కులాలకు భూ కేటాయింపు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న *భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ* మహాత్మా గాంధీ జయంతి ని మనమంతా పండుగలు జరుపుకుంటున్నామని, దక్షిణాఫ్రికా దేశంలో నల్లగా ఉన్నందుకు రైలులో తన పట్ల జరిగిన వివక్షకు చూసి పోరాటం చేసి నల్లజాతీయులకు విముక్తి కలిగించడంలో గాంధీ కీలకపాత్ర పోషించారని, అదేవిధంగా మన దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్రం సాధించారని అన్నారు స్వాతంత్రం లభించిన 75 సంవత్సరాలలో అన్ని వర్గాల వారిని సమానత్వంగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, హైదరాబాదులో కీలకమైన ప్రాంతంలో బంజారా భవన్ ఆదివాసి భవన్ లను ప్రభుత్వం నిర్మించిందని, అదే రకంగా వివిధ వర్గాలకు చెందిన వారికి భూ కేటాయింపులు చేసిందని అన్నారు. భూపాల్ పల్లి జిల్లాలో వివిధ కుల సంఘాలకు భూ కేటాయింపు చేయాలని నిర్ణయించిన తర్వాత, సింగరేణి ఆధీనంలో ఉన్న భూమిని సేకరించి చదును చేసి కుల సంఘాలకు అందిస్తున్నామని, కుల సంఘాలకు భూ కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ కీలకపాత్ర పోషించారని , ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే ప్రశంసించారు. భూ కేటాయిచిన ప్రతి కుల సంఘ భవనాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని, తాత్కాలికంగా ఆయా కుల సంఘాల నిర్మాణాలకు రూ.10లక్షల చొప్పున నిదులు కేటాయిస్తామని, ఎన్నికల తర్వాత పెద్ద కులాలకు రూ. కోటి, చిన్న మధ్య తరహా కులాలకు 50లక్షల చొప్పున నిధులు కేటాయించి భువన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు భూపాల్ పల్లిలో రెండు ఎకరాలలో అంబేద్కర్ భవనం నిర్మిస్తున్నామని, రెండు కోట్ల నిధులతో గిరిజన భవన నిర్మాణ పనులకు మజుడు చేసుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుందని , ముదిరాజ్ కి చేప పిల్లలు పూర్తి స్థాయి సబ్సిడీతో అందిస్తుందని,యాదవ సోదరీలకు గోర్లు,నాయి బ్రాహ్మణులకు,రజకులజూ 250 యూనిట్ ల ఉచిత విద్యుత్తు అందించిన ఘనత కేసీఆర్ కే చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు భూపాల్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్, రైతుబంధు సంస్థ అధ్యక్షులు, గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరి, జడ్పిటిసిలు సాగర్, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ———————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
-
*మహిళలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందేలా చర్యలు-జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
-
పారదర్శకంగా సర్వే పూర్తి చేసి అర్హులైన రైతులకు పట్టాలు అందజేయాలి : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*