You Are Here:
Home
→ ప్రచురణార్థం…..2 తేదీ.07.06.2023 **ప్రజల జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు… రాష్ట్ర మహిళా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్* జయశంకర్ భూపాలపల్లి, జూన్ – 7: రాష్ట్ర రైతులకు జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసిందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం భూపాలపల్లి లోని అన్నారం బ్యారేజ్ వద్ద నిర్వహించిన సాగునీటి వేడుకలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతి వివరాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రభుత్వం సాగునీటి రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోలను వేడుకలో ప్రదర్శించారు.ఈ సందర్భంగా ముందుగా సరస్వతి అన్నారం ప్రాజెక్టు ను గౌరవ ముఖ్య అతిథులు వీక్షించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత అవసరాలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దార్శనికతతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారని, రికార్డ్ సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ఎత్తుపోతల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు సృష్టించిన అపోహలు అనుమానాలను పటాపంచలు చేస్తూ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని, అందుకోసం వారు చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు త్రాగునీటి సాగునీటి ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎండిపోయిన చెరువులు బావులు కాలిపోయే మోటర్లు రైతులు పడిన కష్టాలు చాలా అధికమని అన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో 13 జిల్లాలకు, 31 నియోజకవర్గాలకు, 121 మండలాలకు, 1638 గ్రామాలకు మీరు సరఫరా చేసే కాలేశ్వరం ప్రాజెక్ట్ ని రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో తీసుకున్న చర్యల కారణంగా 2014లో వరి సాగు లో 24 స్థానంలో ఉన్న తెలంగాణ నేడు రెండో స్థానానికి చేరుకుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ.ఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సమయంలో వేగవంతంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రజలకు ఫలాలు అందించారని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన లేజర్ షో, ప్రముఖ గాయని మంగ్లీ లైవ్ షో , సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు,వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి,భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, అడిషనల్ కలెక్టర్ లు దివాకర్, ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ కలెక్టర్ శివ శంకర్ ప్రసాద్,జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు… జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
You might also like:
-
ప్రచురణార్థం……2 తేదీ.02.10.2023 *కుట్టు మిషన్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* ——————————————— జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 02: ——————————————– మహిళలకు కుట్టు మిషన్లలో అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్తో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి మిలీనియం క్వార్టర్స్ లోని మెగా హాల్ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ* భూపాల్ పల్లి నియోజకవర్గం పరిధిలో ఆసక్తిగల మహిళలకు కుట్టు మిషన్లపై అవగాహన కల్పించి ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ట్రైన్ కలెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు ఎంపీపీలు, జడ్పిటిసిలు మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్ మహిళలు, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ————————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
-
Draftప్రచురణార్థం……1 తేదీ.02.10.2023 *సకల వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు…. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* **8 వేల ఎకరాల పోడు పట్టాల పంపిణీ* **13 కుల సంఘాల భవనాలకు భూపాలపల్లి పట్టణం లో భూముల కేటాయింపు* *తాత్కాలిక నిర్మాణాలకు రూ.10లక్షలు మంజూరు అయ్యేలా చర్యలు.* **13 కుల సంఘాలకు భూ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ———————————————- జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 02: ——————————————— సకల వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి ఇళ్లందు క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన బిసి, ఎస్టీ, ఎస్సీ కుల సంఘాల భవన నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి భూ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ* జీవితకాలం చివరి శ్వాస వరకు సమానత్వాన్ని బోధించిన మహాత్మా గాంధీ జయంతి నాడు 13 కుల సంఘాల భవన నిర్మాణాలకు భూ కేటాయింపు చేయడం సంతోషకరమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వివక్షకు తావు లేకుండా ప్రతి వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య బోధన, వసతి ఏర్పాటు అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియా కప్ లో మన మన రాష్ట్రానికి చెందిన నందిని అనే క్రీడాకారిణీ కాంస్య పథకాన్ని సాధించిందని, సదరు క్రీడాకారిణీ తండ్రి చాయ్ అమ్ముతారని, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం మనకు గర్వకారణం అని అన్నారు. భూపాల్ పల్లి జిల్లాలో 73% అటవీ ప్రాంతం మాత్రమే ఉందని, భూములు తక్కువగా లభ్యత ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసేందుకు వివిధ కుల సంఘాలకు భూ కేటాయింపులు చేస్తున్నామని, ఒక తోటలో వివిధ రకాల పూలు ఉన్న విధంగా ఒకే చోట 13 కుల సంఘాల భవన నిర్మాణానికి భూ కేటాయింపులు చేశామని, భూపాలపల్లి పట్టణంలో 15 ఎకరాలు గుర్తించి అందులో 10 ఎకరాలు కుల సంఘాలకు మరో ఐదు ఎకరాలు దేవాలయ నిర్మాణానికి కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కుల సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న గిరిజనులకు 8000 పోడు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పోడ్ పట్టాలకు రెవెన్యూ పట్టాలతో సమానంగా రైతుబంధు ఆర్థిక సహాయం అందజేశామని, జిల్లాలోని పాత్రికేయులకు సైతం పట్టాలు అందిస్తున్నామని, విశ్రాంత ఉద్యోగులకు నాన్ గెజిటెడ్ అధికారులకు గెజిటెడ్ అధికారులకు భూకై ట్యాంకులు చేశామని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన నేతకాని, మాల కులాలకు, ఎస్టి వర్గానికి చెందిన నాయపోడు, బంజారా కులాలకు, బీసీ వర్గానికి చెందిన గౌడ,యాదవ, పద్మశాలి, ముదిరాజు , పెరిక, కుమ్మరి బోయ, వాల్మీకి, రజక ,వడ్డెర , పూశాల నాయి బ్రాహ్మణ కులాలకు భూ కేటాయింపు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న *భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ* మహాత్మా గాంధీ జయంతి ని మనమంతా పండుగలు జరుపుకుంటున్నామని, దక్షిణాఫ్రికా దేశంలో నల్లగా ఉన్నందుకు రైలులో తన పట్ల జరిగిన వివక్షకు చూసి పోరాటం చేసి నల్లజాతీయులకు విముక్తి కలిగించడంలో గాంధీ కీలకపాత్ర పోషించారని, అదేవిధంగా మన దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్రం సాధించారని అన్నారు స్వాతంత్రం లభించిన 75 సంవత్సరాలలో అన్ని వర్గాల వారిని సమానత్వంగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, హైదరాబాదులో కీలకమైన ప్రాంతంలో బంజారా భవన్ ఆదివాసి భవన్ లను ప్రభుత్వం నిర్మించిందని, అదే రకంగా వివిధ వర్గాలకు చెందిన వారికి భూ కేటాయింపులు చేసిందని అన్నారు. భూపాల్ పల్లి జిల్లాలో వివిధ కుల సంఘాలకు భూ కేటాయింపు చేయాలని నిర్ణయించిన తర్వాత, సింగరేణి ఆధీనంలో ఉన్న భూమిని సేకరించి చదును చేసి కుల సంఘాలకు అందిస్తున్నామని, కుల సంఘాలకు భూ కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ కీలకపాత్ర పోషించారని , ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే ప్రశంసించారు. భూ కేటాయిచిన ప్రతి కుల సంఘ భవనాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని, తాత్కాలికంగా ఆయా కుల సంఘాల నిర్మాణాలకు రూ.10లక్షల చొప్పున నిదులు కేటాయిస్తామని, ఎన్నికల తర్వాత పెద్ద కులాలకు రూ. కోటి, చిన్న మధ్య తరహా కులాలకు 50లక్షల చొప్పున నిధులు కేటాయించి భువన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు భూపాల్ పల్లిలో రెండు ఎకరాలలో అంబేద్కర్ భవనం నిర్మిస్తున్నామని, రెండు కోట్ల నిధులతో గిరిజన భవన నిర్మాణ పనులకు మజుడు చేసుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుందని , ముదిరాజ్ కి చేప పిల్లలు పూర్తి స్థాయి సబ్సిడీతో అందిస్తుందని,యాదవ సోదరీలకు గోర్లు,నాయి బ్రాహ్మణులకు,రజకులజూ 250 యూనిట్ ల ఉచిత విద్యుత్తు అందించిన ఘనత కేసీఆర్ కే చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు భూపాల్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్, రైతుబంధు సంస్థ అధ్యక్షులు, గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరి, జడ్పిటిసిలు సాగర్, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ———————————————- జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.
-
*మహిళలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందేలా చర్యలు-జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
-
పారదర్శకంగా సర్వే పూర్తి చేసి అర్హులైన రైతులకు పట్టాలు అందజేయాలి : జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*