ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:25.04.2022, వనపర్తి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా, వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా (52) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆమె తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్,  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post