ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో ప్రజల నుండి 73 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 50 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి మున్సిపల్, పంచాయతీ, ఇతర శాఖలకు సంబంధించినవి.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఎఓ నాగేశ్వర చారి, అధికారులు పాల్గొన్నారు.


