పత్రిక ప్రకటన
తేదీ : 06–06–2022,
ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రజావాణికి 76 ధరఖాస్తులు,
ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని డీఆర్వో లింగ్యానాయక్
సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 76 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను డీఆర్వో స్వీకరించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు