ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి
——————————-
ప్రజా సమస్యలు ఫిర్యాదుల పట్ల అధికారులు సత్వరమే స్పందించాలని…ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని
జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధికారులకు సూచించారు. అంకిత భావంతో పనిచేసే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం ఉంటుందని …. ప్రజా ప్రతినిధులు,అధికారులు జిల్లా అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.
సమస్య ఎక్కడున్నా అధికారులు స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.
గురువారం సిరిసిల్ల IDOC కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, వ్యవసాయం, విద్యా శాఖ, వైద్య, ఆరోగ్యం, పశు సంవర్డక శాఖ, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బిసి, ఎస్సీ అభివృద్ధి, సంక్షేమం, సెస్, రహదారులు,భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. సభ్యులు పలు అంశాలను లేవనెత్తగా వాటికి అధికారులు వివరణ ఇచ్చారు.
వైద్య , ఆరోగ్య శాఖ పనితీరు బాగుందని….
అదే స్ఫూర్తిగా మరింతగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని అన్నారు.
మిషన్ భగీరథ పథకం అమలులో
పలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ సమస్యల పై దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మిషన్ భగీరథ ఇంజనీర్ లను ఆదేశించారు.
సమావేశం అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలులో ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
వాటి గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రతి గడపకు ప్రభుత్వ పథక ఫలాలు అందేలా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేయాలన్నారు.
శాఖ పరంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వ్యవసాయ సాంప్రదాయ పద్ధతుల నుంచి బయటపడుతూ… వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు.
మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తున్నందున జిల్లా రైతులు, ప్రజలు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా భారీ ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వాటర్, హెల్త్ ఎడ్యుకేషన్ స్థిరీకరణ అయిందన్నారు. హెల్త్,ఎడ్యుకేషన్ సిస్టంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ముందంజలో ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోనీ తొట్ట తొలి కేజీ టు పీజీ క్యాంపస్ ను మంత్రి శ్రీ కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు.
కార్మిక క్షేత్రం సిరిసిల్ల ,ధార్మిక క్షేత్రం వేములవాడ నియోజకవర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ చెందుతున్నాయన్నారు.
సర్వ సభ్య సమావేశంలో….
ప్రస్తావించిన సమస్యలను వెంటనేపరిష్కరించాలి
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా అధికారులు పరిష్కారం చూపాలన్నారు.
పెండింగ్ సమస్యలను కూడా వచ్చే సమావేశంలోగా పూర్తిగా పరిష్కరించాలన్నారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎంపీపీలు, జడ్పిటిసిలతో సహా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నారు . అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అలసత్వం చూడకుండా వెలువంటనే పరిష్కారం చూపాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అధికారులకు ఆదేశించారు.
జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ….
సర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రస్తావించిన అంశా సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు నోట్ చేసుకోవాలన్నారు.
సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులతో విచారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. తమ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలి అన్నారు.
సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ….
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ రంగానికి సరిపడా
కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
సింగిల్, టు ఫేజ్ కరెంట్ జిల్లాలో ప్రతి రోజూ 24 గంటలు అందిస్తున్నట్లు తెలిపారు.
సెస్ డిస్కం లో భాగమే నని…. ప్రభుత్వం నుంచి సెస్ కరెంట్ కొని గృహ, వ్యవసాయ రంగానికి కరెంట్ అందిస్తుందన్నారు. గ్రిడ్ లో అంతరాయం వల్ల ఐదు రోజుల పాటు కరెంట్ సరఫరా లో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయనీ రానున్న రోజుల్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. జిల్లాలోని మండల సర్వ సభ్య సమావేశాలకు కూడా తాను హాజరవుతానని, విద్యుత్ సమస్యలకు సాధ్యమైనంత త్వరగా సత్వర పరిష్కారం చూపుతామని చెప్పారు.
సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.