పత్రికా ప్రకటన తేది: 6-2-2023
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు , తాసిల్దారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 106 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలపై 96 , ఆసరా పెన్షన్లు 2, ఎలక్ట్రిసిటీ , ఇరిగేషన్ , వికలాంగుల శాఖ మరియు ఇతర సమస్యలకు సంబంధించి 8 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గట్టు, ధరూర్, ఐజ ,మల్దకల్, ఆలంపూర్ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంబందిత మండల తహసిల్దర్లతో మాట్లాడి ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ , ఏవో యాదగిరి , సుపరింటేన్దేంట్లు రాజు, మదన్ మోహన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచె జారి చేయబడినది