*ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలి*
– భూ సంబంధిత సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలి
*జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి
——————————
ప్రజావాణి లో ప్రజలు అందించిన ఫిర్యాదులు పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి
ఆదేశించారు.
సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు.
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.
ప్రజావాణి లో భూ సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా అర్జీలు వస్తున్నందున
రెవెన్యూ ఫిర్యాదులు, వినతుల పై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.
కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 31 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ శ్రీమతి లీల,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు శాఖల వారీగా
Revenue- 15
MC sircilka- 2
Dpo- 2
Employment – 2
Md cess- 2
MC vmwd- 1
Dcso- 1
Mpdo vmwd- 1
Irrigation- 1
Survey- 1
Mpdo mustard- 1
Mpdo thangallapalli- 1
Fisheries – 1
Total= 31
——————————
.