ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి
ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాల పంపిణీ పై కలెక్టర్లు దృష్టి సారించాలి
డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరితగతిన లబ్దిదారుల కేటాయింపు పూర్తి చేయాలి
అగ్ని ప్రమాధాల నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
0 0 0 0
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు,మరింత ఉత్తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూములు, తెలంగాణకు హరితహారం, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఇంటర్ పదవ తరగతి పరీక్షలు, ఐడిఓసి పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
కంటి వెలుగు అంశం పై రాష్ట్ర సీఎస్ సమీక్షిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 86.5 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 14.23 లక్షల రీడింగ్ కళ్ళద్దాలను పంపిణీ చేశామని, 10.37 లక్షల ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేయగా, జిల్లాలకు 5 లక్షల పైగా ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలు చేరాయని సీఎస్ తెలిపారు. జిల్లాలకు చేరిన ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు త్వరితగతిన లబ్దిదారులకు వారి ఇంటి వద్ద అందించే విధంగా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలపై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని, రిఫరల్ ఆసుపత్రిలో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని, మహిళలకు పూర్తి చికిత్స ప్రాధాన్యతతో ఉచితంగా అందిస్తామని అన్నారు.
భూముల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 58, 59, 76, 118 లకు సంబంధించి పురోగతి పై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 సంబంధించి పెండింగ్ పట్టాలను మార్చి చివరి నాటికి పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కు సంబంధించి క్రమబద్దికరణ రుసుము వసూలు పై శ్రద్ద వహించాలని, మార్చి చివరి నాటికి 40 శాతం, ఏప్రిల్ 15 నాటికి పెండింగ్ 60 శాతం రుసుం వసూలు పూర్తి చేసి పట్టాలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 76 కు సంబంధించి పెండింగ్ లో ఉన్న 3.86 కోట్ల రుసుంను వసూలు చేసి పట్టాల పంపిణీ మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సేకరించిన 1039 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నాయని, వీటి ల్యాండ్ స్కెచ్ ఇంటి పట్టాల వారిగా సరి హద్దులతో వివరాలు, ఇంటి నిర్మాణానికి అనుకూలత వంటి అంశాల పై నివేదిక అందించాలని, ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ముందు నివేదిక ఉంచి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల కేటాయింపు మంచి పురోగతి ఉందని సీఎస్ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22322 ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేశామని, మరో 9411 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఏప్రిల్ మొదటి వారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోడు భూముల పట్టాల పంపిణీ త్వరలో ప్రారంభం అవుతుందని పెండింగ్ లో ఉన్న 14936 దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సూచించారు. అగ్ని ప్రమాధాల నియంత్రణ కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు. హైదరాబాద్ లో ఇటీవలే 2 అగ్ని ప్రమాధాల జరిగాయని, రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో సైతం అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో , పెద్ద అపార్ట్మెంట్, షాపింగ్ మాల్స్ ఫైర్ సెఫ్టీ ఉండాలని అన్నారు. అగ్ని ప్రమాధాల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలు నిబంధనల మేరకు తీసుకోవాలని, అలసత్వం వహించవద్దని అన్నారు. జిల్లాలో ఫైర్ సేఫ్ట కోసం ఆడిట్ నిర్వహించాలని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రారంభించుకున్న సమీకృత కలెక్టరేట్ జిల్లాలలో మార్చి చివరి నాటికి ప్రైవేట్ బిల్డింగ్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేసి షిఫ్ట్ కావాలని, తదుపరి రెంటల్ బడ్జెట్ ఉండదని సీఎస్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైకుంఠ దామం నిర్మాణం పూర్తి చేసామని వాటిని వినియోగంలోకి తీసుకోని రావాలని, వైకుంఠదామాలో విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా సౌకర్యం కల్పన పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలకు నిర్దేశించిన బృహత్ పల్లె ప్రకృతి వనాల, పల్లె ప్రకృతి వనాల లక్ష్యాలు పూర్తి చేయాలని, రానున్న వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎస్ అన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ల్లో వచ్చిన ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం జరిగేలా కృషి చేయాలని అన్నారు. జిల్లాలకు నిర్దేశించిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు.
ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించి 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, 494620 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, 6 పేపర్లు పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని, కాంపోజిట్ సైన్స్ పరీక్ష మాత్రం 9.30 నుంచి 12.50 వరకు ఉంటుందని, దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ప్రశ్న పత్రాల రవాణా, వాటి స్టోరెజ్, పరీక్షా కేంద్రాల్లో వసతూల కల్పన మొదలగు ఏర్పాట్లు కలెక్టర్ పర్యవేక్షించాలని తెలిపారు
తెలంగాణ కు హరితహారం క్రింద వచ్చే వేసవి కాలంలో మొక్కల సంరక్షణ కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని తెలిపారు. వచ్చే సీజన్ లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలి అని, రాబోయే 3 నెలలు మొక్కల సంరక్షణ కు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సీఎస్ అన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, రోమ్ము క్యాన్సర్, గర్బాశయ వ్యాదిగ్రస్థులను మెరుగైన వైద్యచికిత్సల కొరకు అంగన్వాడి ల ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని, మహిళలందరికి అరోగ్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, అర్బన్ ఏరియాలలో మున్సిపల్, మెప్పా సిబ్బంది కంటివెలుగు కార్యక్రమం గురించి మెడికల్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను అవగాహన కల్పించాలని, నియోజక వర్గాల వారిగా కంటివెలుగు కార్యక్రమంపై ఎక్కువ శ్రద్దను కనబరచాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ట్రేని కలెక్టర్ నవీన్ నీకొలస్ , డిపిఓ వీరబుచ్చయ్య, డిఆర్డిఓ శ్రీలతారెడ్డి,జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, మెప్మాపిడి రవీందర్, డిఈఓ జనార్దన్ రావు, డిఐఓ రాజలక్మీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, డిడబ్ల్యుఓ సబితా కుమారి, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యాదికారులు పాల్గోన్నారు.