పత్రిక ప్రకటన
తేదీ : 11–11–2022
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సాధారణం
విధులు నిర్వహించిన చోట మంచి పేరు సంపాదించుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ హరీశ్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమని… అయితే వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలని అప్పుడే వారు పని చేసి వెళ్ళినా వారిని ప్రజలు, అధికారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటారని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్తున్న శ్యాంసన్ వీడ్కోలు సమావేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ… ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమేనని ఈ విషయంలో వారు ఎక్కడకు వెళ్ళినా తమకంటూ ఒక మంచి గుర్తింపును, ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ విషయంలో అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించిన శ్యాంసన్ ప్రజా సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొనే వారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అదే విధంగా బదిలీపై వెళ్ళిన చోట వారికంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లయితే ప్రజలు ఎల్లప్పుడూ వారిని గౌరవిస్తారని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించిన శ్యాంసన్ అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో సైతం మంచి పేరు సంపాదించారని ఇది ఎంతో గర్వకారణమని కలెక్టర్ ఆయన సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు జరుగుతాయని ప్రతి చోటా మంచి పేరు సంపాదించుకోవాలని అదే చిరస్థాయిగా నిలిచిపోతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న శ్యాంసన్ను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ అగస్త్యను పూలమాలలు, శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జడ్పీ సీఈవో దేవసహాయం, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.