ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో   జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ క్షయ దినోత్సవ సదస్సు నిర్వహించడం జరిగింది. 

ప్రెస్ రిలీజ్

24.03.2023.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం హనుమకొండ

పత్రికా ప్రచురణ మరియు ప్రసార నిమిత్తము

క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో   జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ క్షయ దినోత్సవ సదస్సు నిర్వహించడం జరిగింది.  ముఖ్యఅతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్త పట్నాయక్ గారు  హాజరై టి బి వ్యాధిని సంక్రమింపజేసే బ్యాక్టీరియాను కనిపెట్టిన ప్రొఫెసర్ కాక్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తాను హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీక్షా నిర్వహించినప్పుడు జిల్లాలో  క్షయ నియంత్రణ కార్యక్రమం ప్రభుత్వము నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని జిల్లాను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం గమనించానని, గత సంవత్సరంలో టీ బి నోటిఫికేషన్ లలో 73% నిశ్చయి పోశ నా యోజన కార్యక్రమంలో జిల్లా 89% అచీవ్మెంట్ కావడం ఒక మంచి గుర్తుకు సంకేతం అని, అదేవిధంగా 2023 వ సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి క్షయ వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములను చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్న వారి వివరాలు కూడా నమోదు చేసుకుని వారికి కూడా ప్రభుత్వపరంగా అందించే ఆర్థిక మరియు న్యూట్రిషన్ కిట్లను అందించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేసి వారి సేవలను ఉపయోగించుకోవాలని క్షయ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తుతెరగాలని తెలుపుతూ క్షయ వ్యాధి నియంత్రణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి మెమెంటోలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ 2022వ సంవత్సరంలో మొత్తము 7492 మందికి తేమడ పరీక్ష చేయగా 1465 క్షయ వ్యాధి కేసులను నిర్ధారించినట్లు అందులో  ఎం డి ఆర్  టీబి కేసులు 44 కేసులను గుర్తించినట్లు  వీటిలో చికిత్సపరంగా 82% సక్సెస్ రేట్ గా సాధించడం జరిగిందని ఆయన తెలిపారు.

ముందుగా జిల్లా క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ హిమబిందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో క్షయ నియంత్రణలో తీసుకుంటున్న చర్యలు, క్షయ వ్యాధి ప్రివలెన్స్, అవగాహన కార్యక్రమాల గురించి ఆమె వివరించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో హనుమకొండ టీబి హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్  శ్రవణ్ కుమార్,  కాకతీయ మెడికల్ కాలేజ్ సామాజిక వైద్యశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, ప్రోగ్రాం  ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ, టీవీ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి, డాక్టర్ సునీత, ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఈవి శ్రీనివాసరావు, సర్వ ప్రేమ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు   బాలస్వామి  జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, డిప్యూటీ డెమో ప్రసాద్, సి హెచ్ ఓ మాధవరెడ్డి, క్షయ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్, టీ బి సూపర్వైజర్లు విజయ్ , కిరణ్ కుమార్, శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్లు, సెంట్ జాన్స్ నర్సింగ్ విద్యార్థినిలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

టిబి అవగాహన ర్యాలీ

ప్రపంచ క్షయ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి ర్యాలీలో క్షయ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, సెంట్ జాన్స్ నర్సింగ్ విద్యార్థినిలు, టీబీ అలర్ట్ ఇండియా, సర్వ ప్రేమ స్వచ్ఛంద సంస్థ వారు   ప్లాకార్డ్స్ , బ్యానర్స్ చేపట్టి, క్షయ వ్యాధి అంటువ్యాదని, రెండు వారాలకు మించిన దగ్గు ఉంటే క్షయ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, టీ బి అంతం మనందరి పంతం అనే నినాదాలతో ముందుకు సాగింది.

Share This Post