ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిధిలోని జాజాపూర్, బొమ్మన పడు పాఠశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మన ఊరు, మనబడి కింద జరిగే పనుల ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కోటకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనికీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పర్యటించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అన్ని సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఎన్ని కాన్పులు జరుగుతున్నాయని ఈ నెలలో ఎన్ని జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రిజిస్టర్లో నమోదు చేసి రిపోర్టులు పంపాలన్నారు. ఎక్కువ శాతం ఆస్పత్రులలోనే కాన్పులు జరిగేలా నార్మల్ డెలివరీ చేయాలన్నారు. గర్భిణి ఇండ్లకు వెళ్లి బీపీ షుగర్ చెక్ చేయాలని ఆదేశించారు. ప్రతి బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాన్పులు అయ్యాక బాలింతలకు టీకాలు ఇతర పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు,ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ శైలజ, డాక్టర్ బాలాజీ, సూపర్వైజర్లు, యం. యల్. హచ్. పి.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post