Date : 09.01.2023
“ప్రభుత్వ పాలనా లో పారదర్శకత, అధికార యంత్రాంగం లో జవాబుదా ప్రభుత్వ రితనమే ఆర్.టి.ఐ ముఖ్య ఉద్దేశ్యం” అని తెలంగాణా రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమీషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు, విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అద్యక్షతన నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రం ఆన్ ఆర్ టి ఐ (రైట్ టూ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీసు) అనే అంశం పై ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, భారత దేశం అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశం, సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, జటిలమైన సమస్యను కుడా ఆర్ టి ఐ చట్టం వినియోగం ద్వార పరిష్కరించు కోవచ్చు అని, చట్టం పై అందరికి అవగాహనా అవసరం అని అన్నారు, 39 వేల కేసు లలో 33 వేల కేసు లు పరిష్కరించు కోవటం జరిగిందిఅని, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పాలనా లో పారదర్శకత పెరిగింది అని, ప్రజలకు ఆర్ టి ఐ ఒక భరోసా అని, కోవిడ్ లో కుడా ఆర్ టి ఐ కేసు లు పరిష్కరించ బడ్డాయి అని అన్నారు, ప్రత్యక్షంగా, పరోక్షం గా ప్రభుత్వ లబ్ది పొందిన ప్రతి సంస్థ ఆర్ టి ఐ పరిదిలోనికి వస్తున్నది అని, ప్రజా ప్రయోజనం ముఖ్యం అని, ప్రశ్నలు సుఠీగా ఉండాలని, పబ్లిక్ లైఫ్ ప్రైవేటు లైఫ్ వేరు వేరు అని వ్యక్తిగత జీవితం మినహింపు ఉంటుంది అని అన్నారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లకు ఆర్ టి ఐ చట్ట వివిధ సెక్షన్ ల పై అవగహన అవసరం అన్నారు, ఆన్లైన్ దీశాగా అడుగులు పడుతునట్టు, పరిధిలోకి లోబడి వ్యవహరించాలని, వాస్తవాలు బయటకు రావటానికి చీకటిలో దాగిన అంశాలు బయటకు రావటానికి ఆర్ టి ఐ చట్టం తీసుకోని వచ్చింది అని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రశ్నించటం అంటే తెలుసుకోవటం అని, సానుకూల దృక్పదం తో ఇరువర్గాలు వ్యవహరించాలని అన్నారు, సిస్టం ను గౌరవించాలని, రాజ్యాంగ పరిధికి లోబడి చట్టం లో పొందుపరచిన విధంగా ఉండాలని, అధికారుల నిర్లక్ష్య ధోరణి, మూడవ వ్యక్తీ జోక్యం వద్దు అన్నారు, కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని అయినందుకు గర్వ పడుతున్నానని, ఆర్ టి ఐ కమీషనర్ హోదా ను పొందిన వ్యక్తులలో దేశం లో అతి పిన్న వయస్కుల జాబితాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అన్నారు, వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ తన ప్రారంబ పలుకులలో ప్రజా జీవితం లో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఆర్ టి ఐ చట్టం తీసుకోని వచ్చింది అని, ఉద్యోగులలో జవాబుదారి తనం, బాధ్యత, పారదర్శకత పెంచటం లో చట్టం చాల ఉపయోగ పడింది అని, చట్ట పరిదికిలోబడి ప్రతి అధికారి పని చేయాలనీ, సమాచార హక్కు ఒక మానవ హక్కు అని, విశ్వవిద్యాలయం లో చట్టం అమలు బాగా ఉంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాసరావు, ఆర్ టి ఐ సెల్ సంచాలకులు డాక్టర్ ఏం శ్రీనివాస్ తో పాటు బోధనా, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు, సభికులు అడిగిన వివిధ సందేహాలను కమీషనర్ నివృతి చేసారు, అనంతరం శాలువా, బొక్, జ్ఞాపిక తో సన్మానించారు.