ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాలి ,జిల్లా టాస్క్​ఫోర్స్​ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్​ శ్యాంసన్​

ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాలి

అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేయాలి

జిల్లా టాస్క్​ఫోర్స్​ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్​ శ్యాంసన్​

జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్​ను తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న వాటిపై దృష్టి సారించాలని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ అన్నారు.

బుధవారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో ప్లాస్టిక్​ను తగ్గించే అంశంపై జిల్లా టాస్క్​ఫోర్స్​ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్లాస్టిక్​ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోందని. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలు, నష్టాలను ప్రజలకు తెలియజేసి వాటి వినియోగాన్ని తగ్గించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణాన్ని రక్షించిన వారమవుతామన్నారు. అలాగే మున్ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ విషయాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలని అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయాలపై ప్రచార సాధనాల్లో విస్కృతంగా ప్రచారం చేయాలని డీపీఆర్​వోను అదనపు కలెక్టర్​ శ్యాంసన్​ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఈఈ ప్రవీణ్ కుమార్,  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్​ మేనేజర్​, డీపీవో, డీఈవో, ఇంటర్మీడియట్​ ఎడ్యుకేషన్ ఆఫీసర్​,  జిల్లా యూత్​ అండ్​ స్పోర్ట్స్​ అధికారి, డీపీఆర్​వో,  ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపాలిటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post