బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

 సమసమాజ నిర్మాణం కోసం పాడుబడిన సామాజికవేత్త బసవేశ్వరుడు చూపిన బాట లో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

       సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, లింగాయత ధర్మ స్థాపకుడు బసవేశ్వరుని 889వ జయంతి కార్యక్రమము ను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనకబడిన తరగతుల శాఖ అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గోన్న జిల్లా కలెక్టర్ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని,  సమాజంలో బసవేశ్వరుడు కులవ్యవస్థను, వర్ణవిబేదాలను, లింగవ్యవస్థను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అని, ఆయన బోధించిన సాంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడిందని పేర్కోన్నారు. ధర్మం, సమసమాజం కోసం పాటుపడిన సామాజిక వేత్త     ఐన బసవేశ్వరుడు చూపిన బాటలో ప్రతిఒక్కరు నడవాలని కలెక్టర్ పేర్కోన్నారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహార్ రావు, అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Share This Post