బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని సీపీ రంగనాధ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని  సీపీ రంగనాధ్  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

తేది:25.01.2023,

 ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, ఓటర్ గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని సీపీ av రంగనాధ్ అధికారులకు సూచించారు.

బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “13వ. జాతీయ ఓటర్ల దినోత్సవం- 2023” ను పురస్కరించుకొని సీపీ రంగనాధ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

ముఖ్య అతిధి గా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ, భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకోని, ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించుకుంటుందని అన్నారు. 2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారుజిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియ శర వేగంగా జరుగుతున్నదని, 18 సం.లు పూర్తైన ప్రతి ఒక్కరు ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఓటుహక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయాలని ఆయన అన్నారు. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే హక్కు ఓటర్ కు మాత్రమే ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల అధ్యక్ష పాలన గురించి, ఓటు ప్రాధాన్యత గురించి ఆయన వివరించారు. మనదేశంలో యువత ఎక్కువగా ఉన్నదని, దేశ భవిష్యత్తును నిర్ధారించే హక్కు ప్రతి ఒక్క ఓటర్ కు ఉన్నదని ఆయన తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. సూచించారు ఉన్నదనిఒక వ్యక్తికి ఒకేచోట ఓటు కలిగి వుండాలని ఆమె అన్నారు. ఎవరికైనా ఒక్కటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు ఉన్నట్లైతే స్వతహాగా వారు తొలగించేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఓటు ఒక ఆయుధం అని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే హక్కును కలిగి ఉంటుందని ఆమె సూచించారు.
జిల్లా స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్.జి.ఓ.లు గ్రామాలలో విస్తృత ప్రచారం కల్పించాలని, విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటర్ నమోదుకు సంవత్సరంలో 4 సార్లు అవకాశం కల్పిస్తున్నట్లు, జనవరి 1వ. తేదీన, ఏప్రిల్ 1వ. తేదీన, జూలై 1వ. తేదీన, అక్టోబర్ 1వ. తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలోని ఓటర్ నమోదు శాతం తక్కువగా ఉన్నదని, ప్రస్తుతం జాతీయ ఓటర్ నమోదు నిష్పత్తిని చేరుకుంటున్నామని సూచించారు. ఎన్నికల సమయంలో 18 సం.లు దాటిన వారందరూ తప్పని సరిగా ఓటర్లుగా నమోదు అయి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదేశించారు.

అనంతరం సీపీ,జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న సినియర్ సిటిజన్ లకు నూతన ఓటర్ల కు సన్మానం చేశారు. జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పోందిన యువత ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు సక్రమ మార్గంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా ఉపయోగించాలని సూచిస్తూ ఓటరు గా నమోదు చేసుకున్నందుకు కలెక్టర్ అభినందించారు.

ఢిల్లీ నుండి చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.

ఎన్నికల విధులలో ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.ఓటర్ల పై రూపొందించిన పాట ను వారు విడుదల చేసారు. సమావేశం లో పాల్గొన్న వారితో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో dro వసుచంద్ర,RDO రాములు,DRDA శ్రీనివాస్, DMO శ్రీనివాస్,తదితర జిల్లా స్థాయి అధికారులు,మరియు NCC,NSS, స్పోర్ట్స్,NYK, విద్యార్థులు,వలెంటేర్లు, పాల్గొన్నారు.

Share This Post