ఆ కేంద్రాలలో ప్రాంట్ లైన్ వర్కర్స్ ఐన పోలీస్ సిబ్బంది, 60 సంవత్సరాలు నిండిన వారికీ , 15 నుండి 18 సంత్సరాల లోపు వారికీ ఈ కేంద్రాలలో టీకా వేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం బోయిన్ పల్లి యుపిహెచ్సి సందర్శించి అక్కడ టీకా కార్యక్రమాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటె నా దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు.
అనంతరం ముషీరాబాదు లోని యు పి హెచ్ సి వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బూస్టర్ డోసు పై అధికారులు ప్రజలకు అవగాహనా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. వాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడుతూ బంధువులు, స్నేహితులను టీకా వేయించుకునేలా చైతన్య పరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.