భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు.ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత, వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కోరారు.

Share This Post