పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 09-09-2021
మట్టి వినాయకుణ్ణి ప్రతిస్టించి, పర్యావరణాన్ని కాపాడాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ నారాయణ్ పేట ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకులు పంపిణీ లో భాగంగా గురువారం కలెక్టర్ ఛాంబర్ లో కుమ్మరి సంఘం నారాయణపేట జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుణ్ణి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ అందరు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యావరణాన్ని పరి రక్షిస్తూ మట్టి వినాయకులను ప్రతిష్టించాలని సుచించారు.
మట్టి వినాయకులను పూజించడం ద్వారా భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారిమీ అవుతామని అన్నారు.
ఇట్టి కార్యక్రమములో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమ చారి, కలెక్టరేట్ ఏఓ ఖలీద్ మరియు కుమ్మరి సంఘం నాయకులూ దతు, రాజు తదితరులు వారు పాల్గోన్నారు
జిల్లా పౌర సంబందాల అధికారి ద్వార జరి