ప్రచురణార్ధం
మహబూబాబాద్, ఫిబ్రవరి.07.
మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మనఊరు..మనబడి పాఠశాలల అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనఊరు…మనబడి క్రింద 316 పాఠశాలలకు గాను 32 మాత్రమే పనులు పూర్తి అయ్యాయని మిగతా పాఠశాలలు త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రౌండింగ్ అయినటువంటి పాఠశాలల పనులు ఎంత వరకు పని జరుగుతున్నాయని, అవి ఏ స్టేజిలో ఉన్నాయి అన్నది మండలాల వారీగా ఏ ఈలు,ఎం.ఈ.ఓ లను అడిగి తెలుసుకున్నారు. ప్రతివారం పనుల పర్యవేక్షణ చేసి సాధ్యమైనంత వరకు మనఊరు.మనబడి పాఠశాలలను ప్రారంభించడానికి తయారు చేయాలని, పాఠశాలల్లో అభివృద్ధి పనులలో భాగంగా అవసరమైన టైల్స్, డైనింగ్ హాల్, త్రాగునీరు,గ్రీన్ బోర్డ్స్, డెస్క్ లు, నేమ్ బోర్డ్స్, బ్యూటిఫికేషన్ పనులు, వర్షపు నీటిని నిల్వ చేయడానికి ప్రదేశాలను, పూర్తి చేసే పనులకు సంబంధించి మండల అధికారులు తనిఖీలు చేపట్టి పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.సివిల్ వర్క్స్ ఎన్ని పాఠశాలలు పూర్తి అయినవి, పెండింగ్ లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలల బ్యూటిఫికేషన్ పై విద్యా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పూర్తి చేసిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో సమీక్ష నిర్వహించుకునే విధంగా చూసుకోవాలని సూచించారు. మనఊరు మనబడి అభివృద్ధి పనులలో జాతీయ గ్రామీణ ఉపాధి పధకం ద్వారా చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు.
సివిల్ పనులు పూర్తి అయిన పాఠశాలకు పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేసి అప్పచెప్పాలని పెయింటింగ్ సభ్యులకు తెలిపారు. పనులు పూర్తయిన వాటిని నిర్దేశించిన స్ప్రెడ్ షీటులో పంపించాలని అది ప్రతి ఒక్క అధికారి పంపే విధముగా చూసుకోవాలని edm ని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్, పంచాయతీ రాజ్ అధికారులు,ఇంజనీరింగ్ అధికారులు,ఎం.ఈ. ఓలు,పెయింటింగ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.