మన ఊరు మనబడి పనులు వెగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ లోని సమావేశ మందిరంలో మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ కలిసి సమీక్షించారు. జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి ఫేసులో గుర్తించబడిన 329 పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, టాయిలెట్లు, ప్రహరీ గోడ, కిచెన్ షేడ్ నిర్మాణ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని వారు తెలిపారు. జిల్లాలో చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్ ,మేళ్లచెరువు, చిలుకూరు, తిరుమలగిరి మండలాలలో మన ఊరు మనబడి కార్యక్రమం పనులు మందకొడిగా జరుగుతున్నాయని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఎంఈఓ లను కారణాలను అడిగి తెలుసుకున్నారు. మే 20వ తేదీ కల్లా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభాత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. మన ఊరు మనబడి పనులపై పాఠశాలల వారీగా సమీక్షించారు. పాఠశాలల కు సెలవు రోజుల్లో ఎంఈఓ, స్కూల్ హెచ్ఎం, అందుబాటులో ఉండాలని మన ఊరు మనబడి పనులకు పూర్తి సహకారం అందించాలని వారు తెలిపారు.పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి టి శ్రీనివాస్ రెడ్డి ,టిఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ ee రాంచందర్ , de రమేష్ కూమార్, మండల ఎంఇఓలు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
———————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యపేట వారిచే జారీ చేయనైనది