మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. వేడుకలను పూజలు చేసి ప్రారంభించి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి సంప్రదాయాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నదని అన్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి సంతోషంగా జరుపుకునే పండుగని, ఈ బతుకమ్మ పండుగ మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగని తెలిపారు.
ఈ వేడుకలలో పిడి డిఆర్డిఎ ప్రభాకర్, ఎఓ ప్రమీల, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు