మహిళలు పారిశ్రామిక వేతలుగా ఎదగాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన
బుధవారం నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామం లో రైతులకు సెర ట్రస్ట్ అద్వర్యం లో ఉచితంగా విత్తనాల పంపిణీ కార్యక్రమం లో మాట్లాడుతూ మహిళ రైతులు ముందుకు వచ్చి పారిశ్రామిక వేతలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన పిలుపునిచ్చారు. మహిళ సంఘాలకు కేటాయించిన అంతర్రాష్ట్ర రహదారి పక్కన కేటాయించిన 10 ఎకరాలలో బృహత్ అవశది వనన్ని పరిశీలించారు. పరిశీలన కంటే ముందు కొల్లంపల్లి గ్రామం లో రైతు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 ఎకరాలలో బృహత్ ప్రకృతి వనని ఏర్పాటుచేయాడాం సుభసూచనియమన్నారు. మహిళలు ముందుకువచ్చి చేయడం వారు కూడా ఆర్థికంగా ఎదుగుతరన్నారు. రైతులు కూడా ప్రత్యన్మేయా పంటల పై దృష్టి సారించాలని అందరూ ఒకే రకమైన పంటను పండించడం వలన నష్టపోయే అవకాశం లేకపోలేదన్నారు. దేశం లొనే కాకుండా ఇతర దేశాలలో ఆయుర్వేద మొక్కలకు చాలా డిమాండ్ ఉందని మనదగ్గర చాలా రకాల భూములు ఉన్నాయని వాటిని సరైన పద్ధతి లో షాహ్రవేతలు సూచించినట్టుగా పంటలను వేయడం వలన చాలా లాభాలు చేకూరుతాయన్నారు. ఉద్యాన వాన శాఖలో మంచి దిగుబాడి ఇచ్చే మొక్కలు ఉన్నాయని పండ్ల తోట, ఆయుర్వేద మొక్కలు పండించుకోవచ్చన్నారు. మీరు పండించే పంటకు మిల్లర్లు అవసరం లేకుండా ప్రాసెసింగ్ యూనిట్ లను కూడా స్థాపించాడం జరిగిందని ప్రాసెసింగ్ అనంతరం వాటిని అరణ్య ద్వారా ఆమ్మకాలు చేయడం జరుగుతోందన్నారు. 31 ఎకరాలలో 31 మంది రైతులకు సెర ట్రస్ట్ అద్వర్యం లో ఉచితంగా విత్తనలను అందించడం అబినందనియమన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని లాభ పడలన్నారు. అనంతరం మహిళలకు విత్తనాలను పంపిణి చేశారు.
పంపిణి కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుదాకర్, సెర ట్రస్ట్ సభ్యులు సిందియ, DPM రాము ZP కో ఆప్షన్ సభ్యులు తజోద్దిన్, గ్రామా సర్పంచ్ సాయి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు రైతులు తదితరులు పాల్గొన్నారు.