మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలుగు నష్టాలపై అవగాహన కల్పించాలి

*జిల్లాలో మైనర్లు డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు వాడకం కేసుల పూర్తి వివరాలు సమర్పించాలి

*పాఠశాలలో ప్రహరి క్లబ్స్ పనితీరుపై నివేదిక సమర్పించాలి

*విద్యార్థులలో మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలన చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
—————————–
పెద్దపల్లి, జనవరి- 25:
—————————–
జిల్లాలో విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల పై డిసిపి సిహెచ్. రూపెష్ తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన డ్రగ్ అడిక్షన్ కేసులు వివరాలను ఆరా తీశారు. జిల్లాలో మైనర్ విద్యార్థులను డ్రగ్స్, గంజాయి సరఫరా కొరకు వినియోగి స్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

జిల్లాలో మండలాల వారీగా మైనర్లు పాల్గొన్న మాదక ద్రవ్యాల కేసుల సంపూర్ణ వివరాలు శనివారం నాటికి సిద్దం చేయాలని, కేసుల వారీగా సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రహరి క్లబ్స్, వాటి పని తీరుపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.

విద్యాలయాలకు వంద గజాల దూరంలో మద్యం షాపులు ఉండాలని, బెల్ట్ షాపులు ఏమైనా కంప్లైంట్ వస్తె మూసి వేయించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్కూల్ కు దగ్గర ఉన్న కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేయాలని, అక్కడ సిగరెట్, పొగాకు విక్రయించకుండా
చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకలాజిస్ట్ సేవలు విస్తృతంగావినియోగించు కోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి సిగరెట్లు, 21 వయస్సు లోపు గల వారికి మధ్యం విక్రయించడానికి వీలు లేదని, జిల్లాలో ఉన్న మధ్యం షాపులు, పాన్ డబ్బాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సిసి కెమేరాల వివరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న 500 పైగా మెడికల్ షాపులలో హెచ్ డ్రగ్స్ అమ్మకాలు డిజిటల్ విధానం ద్వారా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు

జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువెనైల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా అబ్కారీ శాఖ డి.పి. ఈ. ఓ. ఆర్. మహిపాల్ రెడ్డి, జెడ్పీ.డిప్యూటీ సి. ఈ. ఓ. జి.వెంకట చైతన్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ టి. చందన, సైకియాట్రిక్ సాత్విక్ మైత్రి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post