మాస్టర్ ట్రైనర్ గా యువతీ యువకులు రాణించాలి– జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్

కామారెడ్డి, మార్చి 19 (2022): నిరుద్యోగ యువతీ ,యువకులు ఇష్టపడి నైపుణ్యాలను నేర్చుకొని భవిష్యత్తులో మాస్టర్ టైనర్లు గా రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం డి ఆర్ డి ఎ ఆధ్వర్యంలో ఉన్నతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధి అవకాశాలను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ఫోన్ రిపేరింగ్, హోటల్ మేనేజ్మెంట్, సోలార్ ద్వారా విద్యుత్ తయారీ, కంప్యూటర్, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, బ్యూటీ పార్లర్, కూరగాయల నర్సరీ వంటి వాటి శిక్షణలో నైపుణ్యాలను పెంచుకొని రాణించాలని సూచించారు. ఆర్థికంగా సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పని పూర్తి చేసిన వారికి ఈ శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శిక్షణలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌ మాట్లాడారు. యువతీ యువకులు వారికి నచ్చిన ఉపాధి శిక్షణ పొంది, ఉద్యోగాలు సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. జీవితంలో రాణించి ఆర్థికంగా ఎదగాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ డి ఆర్ డి ఓ మురళి కృష్ణ, ఉపాధి హామీ ఏపీ డి శ్రీకాంత్, డీ పీ ఎం లు, ఏ పీ ఎం లు , యువతీ యువకులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post