మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,


బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులుతో ,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, నిబంధనల ప్రకారం జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ విషయమై ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్లు వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివరించారు. జిల్లా నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పకడ్భందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు పాటిస్తూ జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్తు, గాలి కోసం ఫ్యాన్లు, వెలుతురు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయా పరీక్ష కేంద్రాల్లో ఇతర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 220 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో మొత్తం 44, 014 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రికి చెప్పారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు జిల్లా అధికారులతో ఇప్పటికే ముందస్తు సమీక్ష సమావేశాలు నిర్వహించామని అందువల్ల ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు పకడ్భందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఏసీపీ నరేష్ రెడ్డి , డీటీవో.నరసింహ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post