రాజ్యాంగ హక్కులు-విధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా భారతదేశానికి రాజ్యాంగం చాల గొప్పదని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందితో ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…..
1949 నవంబరు 26న భారత రాజ్యాం గానికి రాజ్యసభ ఆమోదం తెలిపిందన్నారు.
అదే రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు.
రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
భారత రాజ్యాంగం ద్వారానే దేశానికి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చిందన్నారు.
రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు.
అన్ని వ్యవస్థలకూ బాధ్యతలు, అధికారాలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. రాజ్యాం గాన్ని తీర్చిదిద్ది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొ చ్చిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం అత్యున్నత చట్టంగా మారడంతో పాటు కుల,మత,లింగ వర్గభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు.
భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొంది స్తామంటూ అధికారులతో కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్ర మంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి పలు శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post