ప్రచురణార్థం
రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిచే ఫిబ్రవరి 5న నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం …… ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు
—————————–
పెద్దపల్లి, ఫిబ్రవరి -03:
—————————–
ఫిబ్రవరి 5న ఉదయం 11-30 గంటలకు నంది మేడారం లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టును రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఉజ్జల్ భూయన్ గారు ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు నేడోక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 5 న ఉదయం 11-30 గంటలకు ధర్మారం మండలంలోని నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ఉజ్జల్ భూయన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని , ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హై కోర్ట్ జడ్జ్ లు జస్టిస్ శ్రీ పి.నవీన్ రావు, శ్రీ ఎన్.వి. శ్రవణ్ కుమార్ లతో ఇతర హైకోర్టు జడ్జీలు పాల్గొంటారని ఎం.నాగరాజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆ ప్రకటనలో తెలిపారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.