ప్రచురణార్థం
రుణ లక్ష్య సాధనకు సమన్వయం అవసరం…
జనగామ సెప్టెంబర్ 27.
రుణ లక్ష్య సాధనకు సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు అధికారులతో కలెక్టర్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. జిల్లాలో పంట రుణాలకు 1459.71 కోట్లు లక్ష్యం కాగా జూన్ మాసంతం వరకు 165 కోట్లు అందజేయడం జరిగిందన్నారు ఎంఎస్ ఎంఈ క్రింద 290.15 కోట్లు లక్ష్యం కాగా ప్రస్తుతం 36 .17 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు.
ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలని అన్నారు ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న యూనిట్ లను బ్యాంక్ అధికారులతో తరచూ సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలి అన్నారు
రికవరీ శాతాన్ని పెంచేందుకు అధికారులు గ్రామస్థాయిలో లబ్ధిదారులకు అవగాహనపరిచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జిల్లాలో రైతు వేదికలు ఉన్నాయని ప్రతి నెల సమావేశాలు చేపట్టి రుణ ప్రగతి పెంచేందుకు మండల స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు.
అత్యధికంగా పంట రుణాలు ఇవ్వాలన్నారు గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదేవిధంగా కోళ్ల ఫారాలు నెలకొల్పు కునేందుకు సెరికల్చర్ చేపట్టేందుకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల రుణ లక్ష్యాల సాధింపులు 98% ఉండటం ప్రశంసనీయమని ఇదే దిశగా రుణ లక్ష్యాలను పెంచుతూ అత్యధిక మంది నిరుపేదలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు.
విద్యా రుణాలు కూడా అధిక మొత్తంలో ఇవ్వాలని విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
రికవరీ శాతం పెంచినప్పుడే బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తాయని అధికారులు ఆ దిశగా కృషి చేయాలన్నారు. రుణాలు పొందే వారికి కూడా రుణాల వినియోగంలో లబ్ధిదారులకు అధికారులు వెన్నంటి ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఐ అధికారి తేజ్ దీప్త్ బెహ్రా , నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ డిఆర్డిఏ పిడి రాంరెడ్డి జిల్లా అధికారులు ఎల్ డి ఎం శ్రీధర్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.