రెవెన్యూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు పలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరేన్స్ ద్వారా సమీక్షించారు.

రాష్ట్రంలో పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రకటించిన జీవో నెం. 58,59,76 ల  ఉత్తర్వుల మేరకు  క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు  చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.  రెవెన్యూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు పలు జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరేన్స్ ద్వారా సమీక్షించారు. బి ఆర్ కె ఆర్ భవన్ నుండి శనివారం నాడు నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంచిర్యాల, సిద్ధిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేసారు.  ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానంగా జీవో నెం. 58,59,76 అంశాలపై  త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.  పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో పేద  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషిచేయాలని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ జివోలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని సి.ఎస్ పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, సిసిఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Share This Post