రైతువేదికలకు చేయూతనివ్వడం ఎంతో ఆనందకరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

రైతువేదికలకు చేయూతనివ్వడం ఎంతో ఆనందకరం

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్

జిల్లాలోని రైతువేదికలకు ప్రైవేట్​ సంస్థలు తమ చేయూతనివ్వడం ఎంతో ఆనందకరమని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ ఎస్​.హరీష్​ అన్నారు. గురువారం జిల్లాలోని మేడ్చల్​ మండల పరిధిలో ఉన్న రాయిలాపూర్​ ఏఈవో క్టస్టర్​ రైతువేదిక, పూడూరు ఏఈవో క్లస్టర్​ రైతువేదికలకు హెచ్​ఎమ్​ క్లాస్ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ ​ సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన రెండు సిస్టమ్స్​ను జిల్లా కలెక్టర్​కు అందచేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్​ ఛాంబర్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్​ హరీష్​ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఉండి వారికి అన్ని రకాలుగా తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం రైతువేదికలను నిర్మించిందని… వాటికి ఆయా సంస్థల ఆధ్వర్యంలో చేయూతనివ్వడం అందరికీ ఆదర్శమని అన్నారు.  ఇదే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతువేదికలకు తమ సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి మేరి రేఖ, మేడ్చల్​ ఏడీఏ వెంకట రామిరెడ్డి, మండల వ్యవసాయాధికారులు అర్చన, సుధారాణి, హెచ్​ఎమ్​ క్లాస్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, మీనాక్షి, మోషిని తదితరులు పాల్గొన్నారు.

Share This Post