వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తూ 26 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు.. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తూ 26 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేసినారు.

శనివారం తాండూరు నియోజకవర్గము పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న 5 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు విద్యా శాఖా మంత్రి శంకుస్థాపన చేసారు.
తాండూరు నియోజకవర్గము యాలాల్ మండలం కొకట్ గ్రామ పరిధిలో రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని,20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
సాయిపూర్ లో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. తాండూరు పట్టణంలో 3 కోట్ల 47 లక్షలతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనాన్ని కూడా ఈరోజు మంత్రి ప్రారంభించారు. అంతకుముందు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో 165 మంది లబ్ధిదారులకు 1 కోటి 65 లక్షల 19 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తాండూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు.రెండవ దశలో వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలియజేసినారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం తో మునుముందు ఆస్పత్రికి రోగుల వెంట వచ్చే వారి కోసం వెయిటింగ్ హల్ లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు . 100 పడకల ఆస్పత్రితో పాటు, మాత శిశు సంరక్షణ కేంద్రాల్లో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని తెలియజేసారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేన మామ లాగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లతో పెందింటి ఆడ పిల్లల పెళ్ళిళ్ళ కు అండగా ఉన్నారు. రైతు బంధు,రైతు భీమా తో రైతన్నకు అండగా ప్రభుత్వం ఉందని తెలిపారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని తెలిపారు.
తెలంగాణ లో ప్రజలకు ఉపయోగపడేలా,అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత కలెక్టర్ భవనాలు
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.

తాండూరులో కాలుష్యం తగ్గించటానికి అందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలని మంత్రి సూచించారు.
గ్రీన్ బడ్జెట్ వినియోగించి,ప్రభుత్వ లక్ష్యం మేరకు కౌన్సిలర్లు, వైస్ ఛైర్మన్, చైర్మన్ ,కమిషనర్ లు చొరవ చూపాలని సూచించారు.

ఈ సందర్బంగా MLC పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో నియోజకవర్గములొ అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వర్షాలు పడినప్పుడు పాడైన రోడ్ల బాగు కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
మంత్రి కే టి ఆర్ గారి చొరవతో అనేక పనులు మంజూరు చేయించడం జరిగిందని,
కౌన్సిలర్లు అందరూ ఏకతాటిగా ఉండి, అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
తాండూరు శాసనస భ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతు
తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతూన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని తెలియజేసినారు.
తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పాత్ర ఎంతో గొప్పదని, తాండూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చుతామని, రానున్న కాలంలో సమస్యలు లేని ప్రాంతంగా తాండూరును నిలుపుతమని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న
రోడ్ల పనులు పూర్తి చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, తాండూర్, చేవెళ్ల శాసన సభ్యులు రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య, MLC పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Share This Post