ప్రచురణార్థం…..1
తేది.02.05.2022

జగిత్యాల:-జిల్లాలో ఈ వేసవి కాలంలో పశువుల సంరక్షణ పట్ల అవగాహనా కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జి .రవి జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఐ.ఎం.ఎ హాల్ లో వేసవి లో పశువుల సంరక్షణ” పోస్టర్ ను ఆవిష్కరించినారు.
వేసవి లో పశువుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించేలా వాల్ పోస్టర్ ను రూపొందించడం అభినంధనీయమని తెలిపారు. పశుపోషకులు, పాడి రైతులు వేసవి సందర్భంగా పశువుల సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్ లత, జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి భిక్షపతి, సహాయ సంచాలకులు నరేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.